కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తరపున నామినేషన్ వేసిన అనుచరులు

అధిష్టానం ప్రవీణ్ రెడ్డి కే టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం

On
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తరపున నామినేషన్ వేసిన అనుచరులు

భీమదేవరపల్లి ఏప్రిల్ 24 (ప్రజామంటలు) :

 

కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అనుచరులు బుధవారం కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పమేల సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగ రామచంద్రం, బొజ్జపురి అశోక్ ముఖర్జీ, జోగిరెడ్డి, కేతిరి లక్ష్మారెడ్డి, భూపతి శ్రీకాంత్ ప్రవీణ్ రెడ్డి తరపున నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధిష్టానం ఆదేశానుసారం పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ అసెంబ్లీ సీటును త్యాగం చేయడమే కాకుండా, ఆయన గెలుపులో ప్రధాన పాత్ర వహించడంతో పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా అధిష్టానం పెద్దలు ప్రవీణ్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పంపుతామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలను ఏకం చేశారని అన్నారు. వివాద రహితుడు, సౌమ్యుడు, అభివృద్ధియే ప్రధాన లక్ష్యంతో పని చేసే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికే అధిష్టానం టికెట్ తో పాటు, బీఫామ్ అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags