ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం.

On
ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం.

జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) : 

మంగళవారం వెలువడిన ఎస్ ఎస్ సి-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి.

25 మంది విద్యార్ధులు 10 జిపిఏ సాధించారు.

జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 జిపిఏ , మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు జిపిఏ , మరియు సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 1 విద్యార్థి 10 జిపిఏ సాధించారు. అంతే కాకుండా *44 మంది విద్యార్ధులు 9.8 జిపిఏ సాధించారు.

జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 14 విద్యార్థులు 9.8 GPA , మానస ఎక్సెల్లెన్స్ నుండి 24 విద్యార్థులు, సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 06 విద్యార్థులు 9.8 జిపిఏ సాధించారు.అదే విధంగా 9.0 జిపిఏ పైన 223 విద్యార్థులు సాధించారు.

జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 106, మానస ఎక్సలెన్స్ నుండి 93 , సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 24 మంది విద్యార్ధులు సాధించారు. సిద్దార్థ విద్యా సంస్థల నుండి 100 కి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 జిపిఏ , 9.8 జిపిఏ , సాధించిన విద్యార్థులను సిద్ధార్థ విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించారు.

అదే విధంగా పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించిన మార్కుల విషయంలో హర్షం వ్యక్తం చేసి , ఈ విజయానికి కృషి చేసిన సిద్ధార్థ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి ,మానస ,సూర్య స్కూల్స్ డైరెక్టర్లు బోయినపల్లి శ్రీధర్ రావు, బియ్యాల హరి చరణ్ రావు,రజిత రావు, మౌనిక రావు,అజిత మరియు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags