జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

On
జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల , ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) :

జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.

ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురానిపేట్ లో గల సన్ రైస్ తైక్వాండో అకాడెమీలో జరిగిన జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ 2024-2028 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికలకు అబ్జర్వర్ గా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ నుండి జిల్లపల్లి వెంకట స్వామి, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అడ్వకేట్ సి పల్లికొండ గంగాధర్ వ్యవహరించారు.

ఈ ఎన్నికలకు జగిత్యాల జిల్లాలోని తైక్వాండో కు చెందిన వివిధ క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా మంచాల కృష్ణ, నూతన అధ్యక్షుడిగా కోల గంగారావు, జనరల్ సెక్రెటరీగా గాదె సంతోష్, కోశాధికారిగా గందె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కే భీమేశ్వర్, నావనంది రమేష్, ఎండీ యాసిన్ (ఐక్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సీఈవో) సెక్రటరీగా ఎండి సోయబ్ సిద్దిక్, జిల్లా మహేందర్, ఎండి సలావుద్దీన్, బీసీ మెంబర్ గా ఎన్ శ్రీనివాస్, జీ రాంప్రసాద్, బీ భాస్కర్, ఏ శివకృష్ణ, అథ్లెటిక్ మెంబర్ కేకే ధరనిధర్ ఎన్నుకోవడం జరిగింది.

కోరుట్లకి చెందిన మాస్టర్ తైక్వాండో క్లబ్ ఫౌండర్, జనరల్ సెక్రెటరీ నావనంది రమేష్, మెట్ పల్లికి చెందిన మెట్ పల్లి తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి యాసిన్ లు జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.

రమేష్, యాసిన్ లను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags