జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,

On
జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల  ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) :

మంగళవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసి, లాగ్ బుక్ మరియు బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్స్టేషన్ పరిధిలో వినియోగదారులకు ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.

వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఏ ఈ, మల్యాల ను ఆదేశించారు. 

అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లైన్లు బాగుగా పరిశీలించి అంతరాయము లను తగ్గించినందుకు మల్యాల ఏఈ ని మరియు సిబ్బందిని అభినందించారు. 

ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. 

ఈ ఇన్స్పెక్షన్ లో నగేష్ కుమార్, ఏ డి ఈ. టెక్నికల్, దయానందం, ఏ ఈ మల్యాల, గంగరాజు, సబ్ ఇంజనీర్ ఉన్నారు.

Tags