కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ జయశ్రీ

On
కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ జయశ్రీ

కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ జయశ్రీ

జగిత్యాల ఏప్రిల్ 28 (ప్రజా మంటలు) : స్వతంత్ర అభ్యర్థిగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచిన      హనుమండ్ల  జయశ్రీ – రఘు ఎమ్మెల్సీ జీవన రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తో రాజకీయ జీవితం ప్రారంభించిన జయశ్రీ, గత మున్సిపల్ ఎన్నికల సమయంలో మాజీ ఎం పి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు. కానీ ఆమెకు ఆ పార్టీలో సరియైన స్థానం దొరక, పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో టిక్కట్టు ఇవ్వకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా గేలిచి, ఇన్నాళ్ళూ అధికార పక్షానికి వ్యతిరేకంగా, మున్సిపల్ లో జరిగే అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు.

పరిస్థితులు మారి, భారాస రాష్ట్రంలో ఓడిపోవడం, మున్సిపల్ లో కౌన్సిలర్లు తిరుగుబాటు చేసి, ఎమ్మెల్యే అభీష్టానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో అడువాల జ్యోతి చైర్పసన్  గా ఎన్నిక తరువాత కూడా ప్రతిపక్షంలో నే ఉన్న జయశ్రీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లో చేరి, జీవన రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.  

Tags