బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

On
బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా


జగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)
-జిల్లా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో బీఆరెస్ పాత్ర కీలకం.

మేనిఫెస్టో హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాము.

జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ 
 బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆరెస్ పార్టీ కార్యాలయం లో బీఆరెస్  సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా వసంత  మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆరెస్ పార్టీ ప్రజా గొంతుకగా, ప్రజల పక్షాన  సభలో ప్రభుత్వంను నిలాదీశారన్నారు. పోరాట పటిమ కలిగిన పార్టీ బీఆరెస్ కాబట్టే అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు కేటీఆర్, హరీష్ లు ప్రభుత్వ వైఫల్యలపై ప్రశ్నలతో ముచ్చమాటలు పట్టిస్తే, మండలిలో బీఆరెస్ ప్రజాప్రతినిధులు కవితక్క ఆధ్వర్యంలో వినూత్న రీతిలో హామీలపై ప్రదర్శనలు చేస్తూనే, హామీల అమలుపై ప్రశ్నించి ప్రభుత్వం ను ఉక్కిరిబిక్కిరి చేశారన్నారు. అధికార పక్షం, ప్రతి పక్షం అంటే ఏంటో, అది ఎలా ఉండాలో ఎం పని చెయ్యాలో చేసి చూపిస్తున్న ఘనత బీఆరెస్ పార్టీదేన్నారు.

నీళ్లు లేక ఎండిన పొలాలు, అకాల వర్షాలతో నష్టపోయినా పంటలు, ప్రకటించిన గ్యారంటీలు, ఇచ్చిన హామీల అమలుల అంశంలో వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంను నీలదీయడం తో పాటు, పసుపు, మిర్చి పంటలకు మద్దతు ధర, నష్టపోయినా రైతులకు రూ. 25 వేలు, మహిళలలకు ఇస్తామన్నా మహాలక్ష్మి పథకం, స్కూటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ సీఎం  కేసీఆర్  హయాంలో అమలు చేసినవే తప్ప, కొత్త పథకాలు ప్రారంభించదని నిండు సభలో ఒప్పుకున్నారన్నారు.

కాళేశ్వరం పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, పెండింగ్ రియాంబర్స్ విషయం లో కూడా బీఆరెస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన విషయాన్నీ గుర్తు చేశారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన ఎమ్మెల్యే అసెంబ్లీ లో ఎక్కడ కనిపించలేదని ఆఖరికి ఆయన  మాట కూడా వినిపించిన దాఖలాలు లేవన్నారు. గ్రోక్ సంస్థ సర్వే లో సీఎం కేసీఆర్  ఉత్తమ సీఎం గా పేరు రావడం శుభపరిణామం అన్నారు. జగిత్యాల జిల్లాలో సమస్యలపై ఎమ్మెల్సీ లు కవితక్క, ఎల్ రమణన్నలు బీర్పూర్ మండలంలోని రోళ్ళావాగు ప్రాజెక్టు కు షటర్ లు బిగించాలని, కొండగట్టు అంజన్న అభివృద్ధి కి నిధులు కేటాయించాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ , ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, రైతు సమన్వయ సమితి బాధ్యులు అల్లాల దామోదర్ రావు, వెంకటేశ్వర్ రావు, నాయకులు రిజ్వాన్, గంగిపెల్లి వేణు, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి శేఖర్, కోటగిరి మోహన్, అజుమ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...