ఘనంగా ముగిసిన ధర్మపురి బ్రహ్మోత్సవాలు
( రామ కిష్టయ్య సంగన భట్ల)
సుప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన ధర్మపురిలో దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 22వ తేది వరకు 13రోజుల పాటు నిర్వహించిన శ్రీలక్ష్మీనర సింహ (యోగానంద, ఉగ్ర), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శని వారం అర్ధరాత్రితో ఘనంగా ముగిసాయి. సంపూర్ణంగా సమిష్టి కృషితో జయప్రదమైనాయి. మార్చి 11వ తేదీన కళ్యాణోత్సవం, మార్చి 14,15,16 తేదీలలో కోనేరులో యోగా నంద, ఉగ్ర నారసింహ, వేంకటేశ్వరుల తెప్పోత్సవ, డోలోత్సవాలు, 19న రథో త్సవం, 20,21, 22 తేదీలలో మువ్వురు స్వాముల ఏకాంతోత్సవ వేడుకల ప్రధాన కార్యక్రమాలకు రాష్ట్రేతర సుదూర ప్రాంతాలనుండి అశేష భక్త, యాత్రిక జనం ఏతెంచి, కార్యక్రమాలలో భాగస్వాములై మొక్కులు తీర్చుకున్నారు.
కార్యక్రమాల విజయవంతానికి, భక్తులకు వలసిన సదుపాయాల కల్పనకు, సౌకర్యాల మెరుగుదలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార, ఉద్యోగ వర్గాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవాసంస్థల బాధ్యులు సంపూర్ణ సహకారాన్ని అందించి ప్రశంసాపాతృ లైనారు. వివిధ ఆర్టీసీ డిపోలు వ్యూహాత్మకంగా, భక్తుల రద్దీకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యేక బస్సులను నడిపాయి. పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయాలు చోటుచేసు కోకుండా పకడ్బందీ బందో బస్తు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంతరాలు కలుగ కుండా విద్యుత్శాఖ సమయోచిత చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది.
పారిశుద్ధ్య సౌకర్యాల ఏర్పాట్లలో స్థానిక పురపాలక సంఘం పక్షాన మున్నెన్నడూ లేనట్టి ప్రత్యేక శ్రద్ధ కనబరచి, క్షేత్రంలో చెత్త చెదారం పేరుకుపోకుండా, అంటు రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టింది. సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ కళాకారులను, వాద్యకారులను రప్పించి, నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం పక్షాన బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతల చేయూతతో ఏర్పాటు చేసిన నిత్యాన్న కార్యక్రమం, క్షేత్రానికి అరుదెంచిన వేలాది భక్తులకు, యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడింది. అన్నదాన కార్యక్రమ సక్రమ నిర్వహణకు సేవాభావంతో స్థానిక చైతన్య భారతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలకు చెందిన నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు, ఆర్యవైశ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకు బాష్యం చెప్పారు.
బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, గాయత్రీ నిత్యాన్న సత్రం,
అన్నపూర్ణ సేవా సమితి, ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం, ఆర్యవైశ్య సంఘం, స్థానిక విప్రుల గృహాలలో వసతులు, భోజన, త్రాగునీటి సౌకర్యాలు కల్పించి, భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా తమవంతు కృషి సల్పారు. వివిధ ఛానళ్ళ ద్వారా ప్రసారం గావించి, దేశ విదేశాలలో స్వాముల ఉత్సవాలను ప్రత్యక్షంగా చూసే సద వకాశాన్ని కలిగించి, ప్రశంసాపాతృలైనారు.
దేవస్థానం సిబ్బంది, స్థానిక వేద పండితులు, కళాకారులు వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అంకిత భావంతో, అలుపెరుగక, అవిశ్రాంత సేవలందించారని, దేవాదాయ శాఖాధికారులు మార్గ నిర్దేశం చేశారని, క్షేత్ర, దేవస్థాన పౌరోహి తులు, వేదపండితులు, వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్థానిక దైవ కార్యానురక్తులు, మీడియాను దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు ప్రశంసించి, ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
