బీజెపి నాయకులారా! స్థాయికి మించి మాట్లాడితే ఖాబర్దార్ !!
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య, మాజీ అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్
భీమదేవరపల్లి మార్చి 7 (ప్రజామంటలు) :
మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండల బిజెపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోని దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు గాని, హుస్నాబాద్ నియోజకవర్గంలో కాని ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.అంతేకానీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచామని, తెలంగాణ కోసం వీర పోరాటం చేసిన మంత్రి పొన్నంపై వ్యంగ్యంగా స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మొన్న గెలిచిన గెలుపు బిజెపి పార్టీది కాదని అది బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ రాష్ట్రానికి ఏం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సందేహం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య, మాజీ మండల అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గజ్జెల రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు గనవేని కొమురయ్య, బొల్లంపల్లి రమేష్, చిట్కూరి రామచంద్రం సీనియర్ నాయకులు ఎదులాపురం తిరుపతి, గొల్లపల్లి రవీందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు భాష, ఎన్ఎస్ఈ నాయకుడు తాళ్ల అరవింద్ గ్రామ శాఖ అధ్యక్షుడు సయ్యద్ భాష ,గాడిపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
