పట్టభద్రుల మ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపుతో ఘనంగా బీజేపీ సంబురాలు
మీరు ఏడవడం కాదు నరేందర్ రెడ్డి మీ మీ పిల్లల తల్లిదండ్రులను ఏడిపించకు
శ్రీరామోజు శ్రీనివాస్ మండల అధ్యక్షులు
భీమదేవరపల్లి మార్చి 6 (ప్రజామంటలు)
భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టటభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందడంతో టాపాకాయలు స్వీట్లు సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ, నరేందర్ రెడ్డి ఓటమికి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అన్నారు. మల్కకొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిలను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. మాజీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల రక్తం తాగడమే తప్ప పేద ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఉపాధ్యాయులు, మేధావులు, గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ లను టార్గెట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఇద్దరు మంత్రులుండి ఒక్క ఎమ్మెల్సీ గెలిపించుకోలేని మంత్రులు బండి సంజయ్ టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని స్థానిక సర్పంచులు, ఎంపిటిసి, జడ్పిటిసి ఎలక్షన్లు పెట్టకుండా దాటవేస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం బండి సంజయ్ కుమార్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేనటువంటి దౌర్భాగ్య పాలన కాంగ్రెస్ పాలన అని ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, గండు సారయ్య, మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల కిషన్, అంబీర్ కవిత, దొంగల వేణు, బొజ్జపురి పృధ్వీరాజ్, దొంగల రాణా ప్రతాప్, కంకల సదానందం, లక్కిరెడ్డి మల్లారెడ్డి,అయిత సాయి తేజ, బొల్లంపల్లి శ్యామ్,కాలేరు వికాస్,సింగం రాజేందర్, చొప్పరి నవీన్,గద్ద రాజేందర్, బైక్అని అఖిల్, సిద్ధమల్ల రమేష్, వేముల ప్రసాద్, ఆవుల శ్రీనివాస్,మొండెడ్ల ఉదయ్, తాళ్లపల్లి రవిచంద్, జనగాని కుమారస్వామి, చార్మిత, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
