రోడ్డు ప్రమాదంతో సీనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి
జగిత్యాల మార్చ్ 04:
జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి మహ బూబ్ పాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృతి చెందారు.
రెండు ద్విచక్ర వాహనాలు డీ కొనగా, ఇతనికి తీవ్ర గాయాల పాలయ్యాడు.వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదారాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందిన మహబూబ్ పాషా కు బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మంగళ వారం సాయంత్రం ఆయన నిమ్స్ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.
జగిత్యాలకు చెందిన మహబూబ్ పాషా గతంలో బుగ్గారం జి.పి లో సీనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెల్గటూర్ మండలం జగదేవ్ పేట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉమ్మడి ధర్మపురి మండలంలోని అనేక గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని పలు గ్రామాలలో కూడా ఆయన ఇంచార్జీ పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. నూతన పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగేంత వరకు పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఏక కాలంలోనే పలు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించారు.మృతుడు మహబూబ్ పాషాకు తల్లి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
