దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి

On
దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నరహరి అనితర సేవలు

(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాల మిస్ట్...9440595494)

ఒక సాధారణమైన టైలర్ కుటుంబంలో జన్మించి సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని భారతదేశం గర్వించదగిన స్థానంలో నిలిచారు శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్.IMG-20250228-WA0414

తను పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ అధికారి కావాలని ధృఢ సంకల్పంతో... ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన తండ్రితో మొదటి సారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం  హైదరాబాద్ వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఈ రోజుకు కూడా పలు సందర్భాల్లో ఆయన గుర్తు చేసు కుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన తన గమ్యం ముందర అవి చిన్నగానే కనిపించేవనీ చెప్తారు.

ఇంటి నుండి ప్రతి నెల డబ్బులు పంపించలేని పరిస్థితి ఉండడంతో నెల వారి కర్చులకోసం  ట్యూషన్స్ చెప్తూ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన గొప్పతనం ఆయనది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసేస్, ( IES ) లో ఉత్తీర్ణత సాధించి ఒక సంవత్సరం పాటు సైంటిస్ట్ గా సేవలు అందించారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఒక సంవత్సరం పాటు IES ఉద్యోగం చేసి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ  స్టడీ సర్కిల్లో పూర్తి స్థాయిలో సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

2001 లో సివిల్స్ లో ఆల్ ఇండియా 84వ ర్యాంక్ సాధించి మధ్య ప్రదేశ్ క్యాడర్ IAS అధికారిగా నియమింప బడ్డారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆ స్థానంలో నిలిచిన వారు ప్రతి పోస్టింగ్ లో తన మార్క్ పనితనంతో ప్రజల మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మన్ననలు పొందుతున్నారు. మునిసిపల్ కమిషనర్ మొదలుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా మధ్య ప్రదేశ్ లోని ఎన్నో జటిలమైన సమ్యసలకు సమాధానంగా నిలిచారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించిన అవార్డులే వారి పని తీరుకు నిదర్శనం.

నరహరి హమారా లాడ్లి లక్ష్మి యోజన(బంగారు తల్లి) పథకం రూపొందించారు. భేటీ బచావో - భేటీ పడావో పథకానికి పునాదులు వేసారు.
సోషల్ మీడియా ద్వారా గ్రివియన్స్ మొదలుపెట్టిన మొదటి ఐఏఎస్ అధికారిగా నిలిచారు. హరియాలి (హరిత హారం) అనే కార్యక్రమంతో ఒకే రోజు లక్ష మొక్కలని నాటించారు. ఇండోర్ సిటిని స్వచ్ సర్వెక్షన్ లో క్లీనేస్ట్ సిటి ఆఫ్ ఇండియా గా నిలిపారు. ఇండోర్ జిల్లాని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జిల్లాగా నిలిపారు.
గ్వాలియర్ జిల్లాలోని 95 శాతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు జనసంద్రంగా ఉండే ప్రదేశాల్లో  దివ్యాంగులకోసం కచ్చితంగా రాంప్ లు కట్టించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా ఒక్క సంవత్సరంలో 36 లక్షల మంది యువకులకు బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టారు.

నరహరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. వికలాంగులకోసం వారు చేసిన సేవలను మరియు స్వచ్ సర్వెక్షన్ - ఇండోర్ కు గానూ కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి అవార్డు అందించారు.
ప్రతి సంవత్సరం భారతదేశ ఉత్తమ ఐఏఎస్ అధికారులలో పలు ఏజెన్సీస్ మరియు ప్రభుత్వం ఇచ్చే జాబితాలో టాప్ 5 ఐఏఎస్ అధికారిగా నిలిచారు.


మధ్య ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తు అన్ని విజయాలు సాధించినప్పటికి తను పుట్టిన గడ్డకి సేవా చేయాలని ఆలోచనతో తన మిత్ర బృందం ద్వారా ఆలయ ఫౌండేషన్ ని స్థాపించి విద్యా, వైద్య మరియు ఉపాధి రంగాలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మారుమూల గ్రామాల్లో, తండాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. తలసెమ్మియా పిల్లల కోసం రక్తదాన శిబిరాలు వందలాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

వెయ్యి మందికి పైగా వికలాంగులకు  కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలను అందించారు, నిరంతరాయంగా అందిస్తున్నారు.

ఎన్నో పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో స్వయంగా వ్యక్తిత్వ వికాసా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా వేల సంఖ్యలో కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేపట్టారు.

కార్పొరేట్ కంపెనీలలో యువతీ, యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

బసంతనగర్ లో శంకర వారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి వేల సంఖ్యలో నిరంతరాయంగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

రాజ్యాంగ బద్ధంగా అన్ని అవకాశాలు అందరికీ దక్కాలి,  నిర్ణయాత్మకమైన స్థానాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని, నాయకులుగా ఎదిగే అవకాశం అందరికి రావాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్న యువతకి లీడర్షిప్ ట్రైనింగ్ క్లాసెస్ జన అధికార సమితి ద్వారా నిర్వహిస్తున్నారు.

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు అన్ని వర్గాలు అందిపుచ్చుకొని విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు.

నైపుణ్యం కలిగిన యువతీ యువకులకు మరియు బ్యాంకులకు వారధిగా BICCI సంస్థ ఉంటు లోన్లు వచ్చే విధంగా సహకారం అందిస్తున్నారు.
దైవం మానవ రూపేణా  అన్న నానుడికి   నిలువెత్తు నిదర్శనం నరహరి ఐ ఎ ఎస్...

Tags

More News...

Local News 

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్): మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక...
Read More...
Local News  State News 

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం    (రామ కిష్టయ్య సంగన భట్ల          9440595494)    ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాలసభ్యుల...
Read More...
Local News  State News 

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం   (రామ కిష్టయ్య సంగన భట్ల)   ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్ర వారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్టేతర ప్రాంతాల నుండి జానపదుల బృంద గానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వనాలు, మంగళ వాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై  బ్రహ్మోత్సవ...
Read More...
Local News 

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్  మార్చి 14 ( ప్రజా మంటలు) వీరితో పాటు బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మండల , పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ  ఏ ఎం సి ఛైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్ ,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ సర్పంచ్...
Read More...
Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...