రతన్ టాటా సేవలు మరువలేనివి -రాజేశం గౌడ్
రతన్ టాటా సేవలు మరువలేనివి -రాజేశం గౌడ్
హైద్రాబాద్ అక్టోబర్ 10:
ఈరోజు మాజీ మంత్రివర్యులు మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ "రాజేశం గౌడ్, రతన్ టాటా కు కన్నీటి నివాళులర్పించారు
విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అని నిరూపిస్తూ..
భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యాపారవేత్త . నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.
దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరచి అపన హస్తాన్ని అందించి అంచలంచల దేశభక్తుడు.
పేదల మధ్యతరగతి వాళ్ళ కష్టాలను దూరం చేయడమే వ్యాపారమని, ఆదాయం కంటే ఆత్మసంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసుతో కోట్లాది భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలు వెంటబెట్టుకొని వెళ్లిన సిసలైన భారతరత్నం "రతన్ టాటా" కు కన్నీటి వీడ్కోలు పలికారు.
రతన్ జి మీ నుండి నిరాడంబరత, విలువలతో కూడిన వ్యాపార సూత్రాలు స్ఫూర్తి పొంది ఆచరిస్తున్నాం..