పి సి సి అధ్యక్షుణ్ణి సన్మానించిన జువ్వాడి కృష్ణారావు

On
పి సి సి అధ్యక్షుణ్ణి సన్మానించిన జువ్వాడి కృష్ణారావు

పి సి సి అధ్యక్షుణ్ణి సన్మానించిన జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల సెప్టెంబర్ 25:-
తెలంగాణ రాష్ట్ర టి పి సి సి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు  గాంధీభవన్ లో  సన్మానించారు. 
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీభవన్లో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కోరుట్ల నియోజకవర్గం లోని 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన 54 మంది వైద్య సిబ్బంది, ఇతర టెక్నికల్ సిబ్బంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటన్నింటిని తక్షణం భర్తీ చేయాలని, అలాగే వైద్య పరికరాలు కూడా తక్షణం ఆసుపత్రికి మంజూరు చేయాలనీ ఆయన వినతి పత్రం అందజేశారు. 
దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని జువ్వాడి కృష్ణారావు తెలిపారు.

Tags