పాత గూడూరు వాసికి టీచరు ఉద్యోగం

On
పాత గూడూరు వాసికి టీచరు ఉద్యోగం

పాత గూడూరు వాసికి టీచరు ఉద్యోగం

జగిత్యాల అక్టోబర్ 09 (ప్రజా మంటలు) :

జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామ వాసి అయిన ముక్తి కవిత ఇటివల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో జగిత్యాల జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో 77.30 మార్కులతో  రెండవ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అంతే కాకుండా లాంగ్వేజ్ పండిట్ తెలుగు విభాగంలో కూడా 77.30 మార్కులతో జిల్లా స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించారు. తాను సాధించిన రెండు ఉద్యోగాలలో  స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారు.  హైదరాబాద్ లో అక్టోబరు 9 బుధవారం రోజున ఎల్బీ స్టేడియంలో సిఎం సమక్షంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగ ఎంపిక పత్రం అందుకున్నారు.

తన విజయంలో  అమ్మ, అక్క , భర్త మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు.రైతు  కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన కవిత ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, స్నేహితులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కవిత ఇప్పటికే నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరుగా పని చేస్తూ ఉండటం కొసమెరుపు.

 

Tags