అక్రమ ఇసుక తరలిస్తున్న 52 మందిని రిమాండ్ కు తరలింపు

On
అక్రమ ఇసుక తరలిస్తున్న 52 మందిని రిమాండ్ కు తరలింపు

అక్రమ ఇసుక తరలిస్తున్న 52 మందిని రిమాండ్ కు తరలింపు
-జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి.
జమ్మికుంట 05 (ప్రజా మంటలు) :

విలాసాగర్ మానేరు వాగు ప్రాంతం నుంచి గత నెల 26న 4 టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్ మాధవరావును పట్టుకొనగా అతను ఇచ్చిన సమాచారం మేరకు మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 52మంది ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు.

వీరంతా మానేరు పరిసర గ్రామమైన  విలాసాగర్, శంభునిపల్లి, పరిమళ కాలనీలలో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకొని అక్కడినుండి జమ్మికుంట పరిసర గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు  తీసుకుంటామని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.

Tags