రైతు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
రైతు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం  - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రైతు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 18:
రాష్ట్ర రైతాంగానికి 1 లక్ష రూపాయాల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసం నుండి ర్యాలీగా వెల్లి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద వద్ద రాహుల్ గాంధీ మరియు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నెల ముందుగానే రుణమాఫీ

అమలు చేస్తున్నందున ఈ పథకం  మొదటి విడతలో లక్ష రూపాయలు రుణాలను మాఫీ చేశారన్నారు.

అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుండి ఆశల సాగు వైపు నడిపించేందుకే ఈ రైతు రుణమాఫీ పథకం అమలు చేయడం జరిగిందని,ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ కోరిక అని తెలిపారు.
ఇది తెలంగాణ చరిత్రలో రైతు సంక్షేమ అధ్యయనంగా నిలిచి పోతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, 
వివిధ హోదాల నాయకులు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు,  పాల్గొన్నారు.

Tags