డిగ్రీ స్థాయి వృక్షశాస్త్రం పుస్తకాల ఆవిష్కరించిన ప్రిన్సిపల్ డా. సత్యనారాయణ                 

On
డిగ్రీ స్థాయి వృక్షశాస్త్రం పుస్తకాల ఆవిష్కరించిన ప్రిన్సిపల్ డా. సత్యనారాయణ                 

డిగ్రీ స్థాయి వృక్షశాస్త్రం పుస్తకాల ఆవిష్కరించిన ప్రిన్సిపల్ డా. సత్యనారాయణ                 
జగిత్యాల జులై 11 (ప్రజా మంటలు) : జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల    వృక్షశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ పడాల తిరుపతి చేత రాసిన మూడు పుస్తకాలను ప్రిన్సిపల్  ఆవిష్కరించారు ఈ మూడు పుస్తకాలు డిగ్రీ చదువుతున్న మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయని, అత్యంత సులభమైన పద్ధతిలో విద్యార్థులకి చదవడానికి అర్థం చేసుకోవడానికి యోగ్యంగా ఉంటాయని ప్రిన్సిపల్  అన్నారు.

ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా డాక్టర్ కే కిరణ్ మై డాక్టర్ హరి జ్యోతి,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి,డాక్టర్ ఎం సత్య ప్రకాష్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ పి స్వరూప రాణి, డాక్టర్ అంబాల శంకరయ్య, డాక్టర్ జి మానస, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం డాక్టర్ పడాల తిరుపతిని  అభినందిస్తూ, ఈ పుస్తకాలు  విద్యార్థులకే కాకుండా, అధ్యాపకులకు ఉపయోగపడతాయని, మరిన్ని పుస్తకాలను ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా రచించాలని సూచించారు. ఉన్నత స్థాయి విద్యాభ్యాసం చేసే విద్యార్థుల కోసం కూడా పుస్తకాలు రచించాలని వారు అభిలషించారు.

Tags