రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 

On
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 

రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి 
  • ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
  • - సోనియాతో మాయావతి చర్చలు సఫలం 
  • - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ.                            హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ

రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.

గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది. 

మల్లికార్జున్ ఖర్గే దళితుడే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.

ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని  తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది

 ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.

బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

 బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు 

ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి 

ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.

గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని  బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ  ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది

Tags

More News...

State News 

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :  నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి...
Read More...
Local News 

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)  తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో  పంచాంగ శ్రవణం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో    పంచాంగ శ్రవణం     గొల్లపల్లి మార్చి 30( ప్రజా మంటలు):    ఉగాది పండుగ పురస్కరించుకొని , జాగీతయాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో చిలుక ముక్కు నాగరాజు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.     ఉదయం సత్సంగము అనంతరము, స్వామి సూర్య నారాయణ పల్లకి సేవ తదనంతరము ఉగాది పచ్చడి వితరణ  తరువాత దేవాలయము మహిళా కమిటి సభ్యులు మాత మణుల...
Read More...
Local News 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక     జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యం లో శ్రీ *విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణం* ఆదివారం   సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా సంజయ్ కుమార్  రాధిక .ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, సంఘం అధ్యక్షులు అయిల్నేని...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                             

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                                  ఘనంగా స్వామివారి రథోత్సవం,    -స్వామి వారికి రథం ను బహుకరించిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు,      ఇబ్రహీంపట్నం మార్చి 30(ప్రజా మంటలు దగ్గుల అశోక్జ):    గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
State News  Spiritual  

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం - గాయత్రి సత్రంలో పండిత సన్మానం     (రామ కిష్టయ్య సంగన భట్ల...     9440595494)    ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా...
Read More...
Local News 

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్, ఇబ్రహీంపట్నం  మార్చి 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ),జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని పురాతనాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎంపీ నిధులు రూపాయలు 1,50,000 తో ఏర్పాటుచేసిన హైమస్ లైట్ లను ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయిల్ లింగారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కేంద్ర నిధులతోనే...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.       జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  పట్టణములోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విద్యతోపాటు భారత దేశ  సంస్కృతి సాంప్రదాయాలను సైతం బోధించడం అభినందనీయం అని...
Read More...
Local News 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మరియు నంబి వాసుదేవాచార్య కౌశిక  ద్వ జారోహణం గావించి, ఉగాది ప్రాశ స్త్యాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్...
Read More...
Local News 

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్​, మార్చి 29 ( ప్రజామంటలు ):    గత 28 రోజులుగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పవిత్ర రంజాన్​ మాస ఈవెంట్లు జరిగాయని, ఇందులో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని పలువురు ముస్టిం కమ్యూనిటీ పెద్దలు ప్రశంసించారు. శనివారం సాయంత్రం వారాసిగూడ జడ్​ఎం బాంకెట్​ హాల్​ లో ఇమామ్స్​, మౌజన్స్, ముస్టిం...
Read More...
Local News 

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు    జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లోజగిత్యాల...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)  పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి...
Read More...