కెవైసి ల పేరుతో గ్యాస్ ఏజెన్సీల దోపిడీ - పట్టించుకోని అధికారులు

On
కెవైసి ల పేరుతో గ్యాస్ ఏజెన్సీల దోపిడీ -  పట్టించుకోని అధికారులు

- టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి 

జగిత్యాల ఎప్రిల్ 04:జగిత్యాల జిల్లాలో  వంట గ్యాస్  సిలిండర్లు సరఫరా చేస్తున్న కొందరు ఏజెన్సీల వారు కెవైసి, ఇతరత్రా కారణాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  గ్యాస్ ఏజెన్సీల వారు కెవైసీ, కొత్త పాస్ బుక్ ల పేరుతో, సిలిండర్లు ఇంటికి సప్లై చేసే రవాణా ఖర్చుల పేరుతో విచ్చల విడిగా దోపిడీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంటికి గ్యాస్ బుడ్డి సరఫరా చేసినందుకు పట్టణ ప్రాంతాలలో రూ.20 నుండి 30 వరకు, గ్రామీణ ప్రాంతాలలో రూ.50 కి పైగా అధికంగా దోచుకోవడం జరుగుతుందన్నారు. ఇంత దోపిడీ జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

వంట గ్యాస్ వినియోగ దారులు ఎవరైనా ఇలాంటి దోపిడీకి న్... ఫోన్ కాల్స్ కు గురైతే.... స్థానిక తహసీల్దార్ లకు, ఆర్డివో లకు, జిల్లా కలెక్టర్ కు లేదా 1906 టోల్ ఫ్రీ, 18002333555 నంబర్ లకు  కూడా పిర్యాదు చేయవచ్చునని చుక్క గంగారెడ్డి సూచించారు.

కొన్ని గ్యాస్ ఏజెన్సీల వారు ప్రత్యేకంగా పని గట్టుకొని  ప్రత్యేక టెలికాలర్స్ ను ఏర్పాటు చేసుకొని ఫోన్ కాల్స్ చేయించి వారి ఏజెన్సీ కార్యాలయాలకే వినియోగదారులను పిలిపించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కెవైసి పేరుతో రూ.150 నుండి 200 వరకు, రబ్బర్ ట్యూబ్ మార్పిడి పేరుతో రూ.500 వరకు, ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్ చెక్ చేయకున్నా చేసినట్లు ఆపీసుల్లోనే ఫామ్స్ నింపుకొని సర్వీస్ చార్జీల పేరుతో మరింత దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త డొమెస్టిక్ గ్యాస్ కస్టమర్ కార్డుల పేరుతో కూడా  అదనంగా రూ.150 నుండి 200 వరకు వినియోగ దారుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తనతో పలువురు బాధితులు వాపోయినట్లు చుక్క గంగారెడ్డి వివరించారు.  
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని, దోపిడీకి గురైన వినియోగ దారులకు తిరిగి డబ్బులు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బాధిత ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags

More News...

Local News 

బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం 

బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం  అధ్యక్షులుగా ఎండి అబ్దుల్ రహమాన్ బుగ్గారం ఏప్రిల్ 05: బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ అధ్యక్షునిగా ఎండి అబ్దుల్ రహమాన్ ను మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా ఎండి ముజ్జు ప్రధాన కార్యదర్శిగా ఎండి ఫైజాన్ క్యాషియర్ గా ఎండి మున్వర్ షరీఫ్ కార్యదర్శులుగా ఎండి బాబర్ ఎండి యాసీన్ కార్యవర్గ సభ్యులుగా...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు    జగిత్యాల ఏప్రిల్ 4(ప్రజా మంటలు)విశ్వావసు  నామ సంవత్సరము మొదటి  శుక్రవారం  రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని...
Read More...
Local News 

శాంతి  భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

శాంతి  భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి ఎప్రిల్ 04 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు,  గొల్లపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీదులో, మసీద్ కమిటీ సభ్యులు దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 3 సీసీ కెమెరాలను ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్  రామ్ నరసింహ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ అన్ని దేవలయాల్లో,...
Read More...
Local News 

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం. సికింద్రాబాద్,  ఏప్రిల్ 04 ( ప్రజామంటలు): సీతాఫల్మండి  బీదలబస్తీ లోని విశ్వశాంతి యువజన సంఘం, రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో  ఈ నెల 12 తేదీన  హానుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించారు ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్ల కోసం శుక్రవారం ఆలయ ప్రాంగణం లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
State News 

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్ 

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్  - బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్   హైదరాబాద్ ఏప్రిల్ 04:     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును ఆమోదించాలని బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల హైదరాబాద్...
Read More...
Local News 

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి..  వారి అభ్యున్నతి కి కృషి చేయాలి  తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి..  వారి అభ్యున్నతి కి కృషి చేయాలి   తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య    జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు) కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  శుక్రవారం ఎస్ సి, ఎస్ టి అభివృద్ధి సంక్షేమ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మి నారాయణ లతో కలిసి సమీక్ష నిర్వహించారు . ఎస్టీ...
Read More...
Local News 

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000  రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000  రూపాయల పరిహారం

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000  రూపాయల జరిమాన  * బాదితుడికి 1,00,000  రూపాయల పరిహారం   జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)  సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కసాది చంద్రయ్య  అనే వ్యక్తి గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు  తేదీ 14 -02 -2017  రోజున ఉదయం గొర్రెలను మేపుకొని సాయంత్రం 7 గంటల సమయం లో తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కోనాపూర్ కోర్టు...
Read More...
Local News 

టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా బోగోజి ముఖేష్ కన్నా 

టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా బోగోజి ముఖేష్ కన్నా  జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు) జగిత్యాలకు చెందిన బోగోజి ముఖేష్ కన్నా టిపిసిసి సేవాదళ్ సెక్రటరీగా నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా అంచలంచలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహరహం కృషి చేసిన ముఖేష్ కన్నా నియామక ము  కావడం పట్ల  మాజీ ఎమ్మెల్సీ జీవన్...
Read More...
Local News 

గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన

గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన గొల్లపల్లి ఎప్రిల్ 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ సెక్టార్ లోని రాఘవపట్నం, రాపల్లి, శంకర్రావుపేట, వేణుగుమట్ల ఇబ్రహీం నగర్, ఇశ్రాజపల్లి, బొంకూరు, బి బి రాజుపల్లి అంగన్వాడి సెంటర్లలో గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.   కార్యక్రమంలో సిడిపిఓ మేడం వీరలక్ష్మి  మాట్లాడుతూ తల్లులకు సరైన పోషణ పోషకాహారం
Read More...
Local News 

ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎస్సీ ఎస్టీల పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి    జగిత్యాల ఏప్రిల్ 4 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.   జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాజీ మంత్రివర్యులు...
Read More...
Local News 

రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ

రాజకీయ దురంహాంకారంతో కేటీఆర్ బెదిరింపులు - ఏఐసీసీ మెంటర్ డా.కోట నీలిమ సికింద్రాబాద్ ఏప్రిల్ 04 (ప్రజామంటలు):                       బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోసం తహతహలాడుతూ, ఆక్రమంలో  తమ  రాజకీయ అపరిపక్వతను బయటపెట్టుకుంటున్నారని  అని ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమ అన్నారు.ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను బెదిరించడం, అభివృద్ధిని అడ్డుకోవడమనే సాకుతో భయపెట్టడం తగదన్నారు. హెచ్సీయూ నిరసనల...
Read More...
Local News  Spiritual  

బీబీకే ఆధ్వర్యంలో శిల్పాదీదీ పోస్టర్‌ ఆవిష్కరణ

బీబీకే ఆధ్వర్యంలో శిల్పాదీదీ పోస్టర్‌ ఆవిష్కరణ గొల్లపల్లి ఎప్రిల్ 04  (ప్రజా మంటలు):    దైవభక్తి కలిగి ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గొల్లపల్లి ఎస్సై సతీశ్‌ అన్నారు. గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లిలో శ్రీరామనవమి సందర్భంగా బీబీకే ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.    ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, బీబీకే ట్రస్ట్‌...
Read More...