జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)
సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ లోనీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరిండెంట్ ,డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ , సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్పాడ్, అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 28, పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ గాని స్మార్ట్ వాచ్ లు అనుమతి లేదని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో శానిటేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రాలో సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ఫ్యాన్స్ లైటింగ్ వంటి ఏర్పాటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ,సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
