పథకాలపై ప్రశ్నించినందుకే మహేష్ పై కేసు - జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జ
పథకాలపై ప్రశ్నించినందుకే మహేష్ పై కేసు పథకాల పై సామాన్యులకు మాట్లాడే హక్కు లేదా..? మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల అక్టోబర్ 17 (ప్రజా మంటలు) : సోషల్ మీడియా కేసు నుంచి విడుదల అయిన జగిత్యాల నియోజకవర్గ రాయికల్ మండల అల్లిపూర్ గ్రామ లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బిఆర్ఎస్ నాయకులు అనుమల్ల మహేష్ ను స్థానిక బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరామర్శించిన మాజీ జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:-రాష్ట్రంలో మార్పు మొదలైందని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ గారి పాలననే కావాలని కోరుకుంటున్నారని జగిత్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని వారందరికీ పార్టీ అండగా ఉంటుందని కలిసికట్టుగా ఇదే స్ఫూర్తితో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు పోరాడాలని అన్నారు. రాయికల్ మం. అల్లిపూర్ లో మహేష్ ని వారి కుటుంబ సభ్యులను అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తాము ఎల్లవేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
----------------