ప్రజావాణి ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ పి. రాంబాబు
జగిత్యాల అక్టోబర్ 14 ప్రజా మంటలు
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డితో కలసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ పి. రాంబాబుఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 22 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, ఆర్డీవోలు, పులి మధు సుధన్ గౌడ్ , శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.