కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి
సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పాదయాత్రలు వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుందని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వర రాజేశ్వరి అన్నారు బుధవారం ఆమె మెట్టుగూడలో మీడియాతో మాట్లాడుతూ... అంబేడ్కర్ ను అవమానించి ప్రజాస్వామ్యన్ని కాలరాసిన కాంగ్రెస్ పార్టీ చేసిన దేశద్రోహపు చర్యలను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులు లేని కాశ్మీర్ ను తయారు చేసిందని ఈశాన్య భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా చేసి నిత్యం ఆశాంతికి దారి తీసిందన్నారు.370 ఆర్టికల్, 35(A) లాంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచలేదని అంబెడ్కర్ ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించి 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంబెడ్కర్ పై నెహ్రు ఇంట్లో పనిమనిషిని పోటీకి దింపి దుష్ప్రచారం చేసి ఓడించిన కాంగ్రెస్ పార్టీకి జై భీమ్ అని ఉచ్చరించే నైతిక హక్కు లేదన్నారు.అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరించి 1975లో ఎమర్జెన్సీ విధించి సెక్యులర్ అనే పదాన్ని చేర్చి అంబెడ్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పట్టుబడిన తొంబైమూడు వేల మంది పాక్ సైనికులను వదిలిపెట్టి జయించబడిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ కు బహుమతిగా ఇచ్చిందని 90వేల చ.కి.మీ. భూభాగంతో పాటు కైలాస మానస సరోవరంను చైనాకు అప్పగించిందని, ఇవన్నీ మరచిపోయి పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ బిజెపి హయాంలో అరవైనాలుగు వేల చ.కి.మీ. చైనా ఆక్రమించిందని దుష్ప్రచారం చేసి దేశం పరువుతీస్తున్నాడని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో రోహింగ్యాలకు పునరావాసం కల్పించి బంగ్లాదేశ్ ముస్లింలను దేశంలోకి చొప్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. NRC ని వ్యతిరేకించి రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టు తలుపులు తెరిపించి శిక్ష పడిన దేశద్రోహులను రక్షించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
2700 వందల మంది సిక్కులను ఊచకొత కోసి వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా ఆలపించకుండ చేసి 26/11 దాడుల వెనుక హిందువుల హస్తం ఉందని చెప్పిన పార్టీ కాంగ్రెస్ అని 1966లో గోరక్షక ఉద్యమకారలైన సాధుసంతువులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి వందలాది మంది పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జైబాపు అనే హక్కు లేదన్నారు. హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చి అమర్ నాథ్ యాత్రకు పన్ను వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుజరాత్ లో సర్దార్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని నిర్మించుకున్నాడని విరోధించి ప్రారంభోత్సవానికి వెళ్లకుండ అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ను విరోధించిందని ఇంతటి నీచమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీని విమర్శించడం మానుకొని కాంగ్రెస్ చేసిన తప్పులకు దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీకి అంబెడ్కర్ పట్ల గౌరవం ఉంటే 1993 లో భారతరత్న ప్రకటించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీజేపీకి అంబెడ్కర్ పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబెడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి భారతరత్న ప్రధానం చేసి రాజ్యాంగ విలువలకు లోబడి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొంది మూడవసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
