ఘనంగా అయ్యప్ప స్వామి జయంతి వేడుకలు
సికింద్రాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని బన్సీలాల్ పేట్ డివిజన్ వాస్తవ్యులు మణికంఠ బ్రదర్స్, గొల్ల కొమరయ్య కాలనీ ప్రధాన కార్యదర్శి ఈ. నర్సింగరావు, కోశాధికారి వినోద్ కుమార్, ఈ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆధ్యాత్మిక భావనతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని రవీందర్ యాదవ్ (స్కైలాబ్) విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా షాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
వీరితోపాటు గోల్డ్ మాన్ దర్గా శ్రావణ్, జిహెచ్ఎంసి నార్త్ జోన్ మాజీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి నార్త్ జోన్ మాజీ రిటైర్డ్ అధికారి గంగాధర్ రెడ్డి, జిహెచ్ఎంసి రిటైర్డ్ ఏసిపి రాజేందర్ కుమార్ యాదవ్, ఏసీపీ రమణ, జిహెచ్ఎంసి బి. ఎం.ఈ.యు యూనియన్ సభ్యులు అశ్రఫ్ అలీ, ప్రకాష్, గోపాల్ కృష్ణ, లక్ష్మీనారాయణ బాలరాజ్, తోపాటు బిఈఈ చైర్ పర్సన్ భావిక్ భాయ్, స్థానిక కార్పొరేటర్ హేమలత, విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రచారాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని సుమారు 2500 మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... మణికంఠ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహత్తర కార్యక్రమం అయ్యప్ప స్వామి జన్మదినం వేడుకకు విచ్చేసిన ముఖ్య అతిథులకు భక్తులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ప్రతి సంవత్సరం ఇదే విధంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఆయన జన్మదిన నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు. నీలకంఠ భజన మండలి చేసిన అయ్యప్ప స్వామి భజన పాటలు భక్తులను అలరించి ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
