గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం..*
కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యే మీద నిరాధారణ ఆరోపణలు సరికాదు.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేదు
తప్పుడు ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు
గొల్లపల్లి ఫిబ్రవవరి 23, (ప్రజామంటలు):
గొలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులసమావేశంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత కొంత కాలంగా గొల్లపెల్లి మండల కేంద్రం లోనీ సర్వే నెంబర్ 735, 544 లలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కి సంబంధించి కొంత మంది కావాలని అధికార పార్టీ నాయకుల పైన దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.
శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం, అక్రమ నిర్మాణాలకి సంబంధించి కొంత మంది కావాలి అని నిర్మాణాలు చేపట్టిన పేద వారి వద్ద నుండి దళారులు డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కొన్ని పత్రికలలో రావడం నిజం కాదని పేద వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే నిన్నటి నిర్మించిన ఇళ్లను ధ్వంసం చేసినప్పుడు డబ్బులు తీసుకున్న వారిని నిలదీసే వారు కదా అని ప్రశ్నించారు.
స్వయాన ఎమ్మెల్యే నిజమయిన పేద వారు అయితే వారికి నేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భూమిని వారికి కేటాయించి ఇళ్లను నిర్మాణం చేయిస్తాను అని చెప్పడం అటువంటి నాయకుని మీద పేద వారి ఇళ్లను కూల్చామని ఆదేశాలు జారి చేశాడు అనడం సరి కాదు ఇంకోసారి పార్టీ మీద ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు
మమ్మల్ని గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఎన్నో ఆశలు చూపించిన కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు లక్ష్మణ్ కుమార్ కొరకు గత పది సంవత్సరాలుగా కష్టపడుతూనే వచ్చాం ఎన్నడూ కూడా భయపడకుండా పార్టీని బలోపేతం చేస్తూనే వచ్చాం అటువంటి మా మీద ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని నిందలు వేయడం సరికాదు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పుర పాటి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్ర గంగాధర్, కాసరపు అరవింద్ గౌడ్, రెవెళ్ళ లింగన్న, లంబ లక్ష్మణ్ చెవుల మద్ది గంగాధర్ ,చిర్ర దిలీప్ ,వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పురం శెట్టి గౌతం, నేరెళ్ళ మహేష్ ,కంది వెంకటేష్ నల్ల రామ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక

శ్రీఉజ్జయిని మహాంకాళి ఆలయ హుండీ లెక్కింపు.

అర్హతలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు రాజీవ్ ఆరోగ్యశ్రీ లోకి...

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నగల దొంగల ఆచూకి తెలపండి

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ

పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
.jpg)