జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా విజయదశమి వేడుకలు
అదనపు కలెక్టర్,మున్సిపల్ చైర్ పర్సన్ నేతృత్వంలో అంగరంగ వైభవంగా శ మీ పూజ
On
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)
జగిత్యాల అదనపు కలెక్టర్ రాంబాబు , మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం స్థానిక జంబి గద్దెపై శమీ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉభయ దేవేరులతో అశ్వరూడుడై శ మీ పూజకై బయలుదేరారు.
అనంతరం జమ్మిగడ్డపై శ మీ పూజ కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య, రుద్రంగి. గోపాల కృష్ణ శర్మ, తిగుళ్ల విశుశర్మలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు ,వార్డు కౌన్సిలర్లు చాకుంట .
వేణు మాధవరావు, రేపల్లె హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారు పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తుల ముంగిట దర్శనమిచ్చారు. మంగళవాద్యాలతో భక్తులు స్వామికి స్వాగతం పలికి దర్శించుకున్నారు. స్వామి వారి నామస్మరణతో పట్టణమంతా మారుమోగింది.
Tags