పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
-
కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ?
- ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
- ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???
జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :
పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.
గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.
పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.
కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.
యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.
న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.
సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.
పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.
పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.
ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?
సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?
లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
