అనాథలు, నిరాశ్రయులకు 261వ అన్నదానం -మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేయాలి
On
అనాథలు, నిరాశ్రయులకు 261వ అన్నదానం
-మొబైల్ వైద్యశాలలు ఏర్పాటు చేయాలి
పద్మానగర్ సెప్టెంబర్ 22:
హైదరాబాద్ మహానగరంలో ఫుట్ పాతుల మీదనే జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి ఆహారాన్ని అందించాము. అకాలవర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వివిధ రోగాల బారిన పడుతున్నారు. ఈ అభాగ్యుల విషయంలో మానవతా దృక్పధంతో ప్రభుత్వం అలోచించి, చొరవ తీసుకోని నగరంలో పలు మొబైల్ వైద్యశాలలను ఏర్పాటు చేసి అనాథలు, నిరాశ్రయులు ఎక్కడ ఉంటే అక్కడే ఆరోగ్యపరీక్షలు చేసి ఔషధాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 261వ అన్నదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ సభ్యులు కుషికోమాల్, అఖిల్, శుభం, రాజేశ్వర్ రెడ్డి మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.
Tags