జగిత్యాల ఆవాస భవన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు ఆహ్వానం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఆగస్టు 20( ప్రజా మంటలు)
సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవానికి రావలసిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఆవాస కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన జగిత్యాల ఆవాస కమిటీ సభ్యులు ఈనెల 25న నిర్వహించనున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎన్నమనేని అశోకరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, మహిపాల్ రెడ్డి, సంతోష్ తదితరులు ఉన్నారు.
Tags