75వ ఇందిరా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

On
75వ ఇందిరా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

75వ ఇందిరా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగిత్యాల  రూరల్ జులై 05 (ప్రజా మంటలు) :

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 75 వ ఇందిరా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. 

శుక్రవారం జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో ఫారెస్ట్ ఏరియాలో 75 వ ఇందిరా వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 45 లక్షల మొక్కలను జగిత్యాల జిల్లాకు టార్గెట్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు వెయ్యి మొక్కలు నాటడం జరిగిందని, ఇంతకుముందు 5 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, 15 లక్షల మొక్కలకు ఫిట్టింగ్ పూర్తి అయిందని ఆయన అన్నారు. ఆగస్టులోగా టార్గెట్ ను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మొక్కలను నామ మాత్రం కాకుండా నాణ్యమైనవిగా, మొక్కలను రక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నీ శాఖల వారిని భాగస్వామ్యం చేయుటకు ఇప్పటికే పాఠశాల విద్యార్థులను, అటవీ శాఖ అధికారులచే మొక్కలు నాటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఎవరైనా నాటిన మొక్కలను, చెట్లను కానీ కట్ చేసినట్లయితే వారిపై కేసును పెట్టడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ పిల్లలకు అందించే యూనిఫాంలను మహిళా శక్తి కుట్టు కేంద్రాల ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఎస్. జి. హెచ్ మహిళలకు మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏక రూప దుస్తుల కుట్టు కేంద్రాన్ని  ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రఘువరన్, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, తదితరులు పాల్గొన్నారు.

Tags