శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
అమెరికాలోని 295 మంది భారతీయులతో,
శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
• అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు
వాషింగ్టన్ ఫిబ్రవరి 05:
అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం సీ-17 స్థానిక కాలమానం ప్రకారం సోమవారం శాన్ ఆంటోనియో నుంచి భారత్కు బయలుదేరింది. విమానం 24 గంటల తరువాత పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని, వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరినీ పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ విమానం ఇంధనం కోసం జర్మనీలోని రామ్ స్టీన్ ఆగనుంది. ఈ పరిణామాలను ధ్రువీకరించడానికి యూఎస్ ఎంబసీ నిరాకరించింది.
18వేల మందితో జాబితా..
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) దాదాపు 18,000 మంది డాక్యుమెంట్లు లేని భారతీయ పౌరుల తొలి జాబితాను రూపొందించింది. టెక్సాస్లోని ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాన్డియాగో నుంచి 5,000 మందికి పైగా వలసదారులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పెంటగాన్ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం, 725,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు, మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత అనధికారిక వలసదారుల జనాభాలో భారత్ మూడోస్థానంలో ఉంది. డాక్యుమెంట్లు లేని భారతీయులను చట్టబద్ధంగా తమ దేశానికి తిరిగి తీసుకురావడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని గత నెలలో న్యూఢిల్లీ తెలిపింది.