సిపిఎస్ యూనియన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి నామినేషన్ దాఖలు
యుపిఎస్ ను అడ్డుకోవాలంటే ఇన్నారెడ్డిని ఆశీర్వదించండి
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
గొల్లపల్లి ఫిబ్రవరి 04 (ప్రజామంటలు) :
ఫిబ్రవరి 27న జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయుటకు తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్న యుపిఎస్ విధానాన్ని అడ్డుకోవడానికి సిపిఎస్ యూనియన్ ఎమ్మెల్సీ బరిలో ఉందని, ఇన్నా రెడ్డి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కష్టపడిన వ్యక్తి చూడాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి మాట్లాడుతూ 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సేవ చేస్తూ ఉపాధ్యాయుల కష్టం తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానని, ఉపాధ్యాయుల పెన్షన్ విధానాన్ని కార్పొరేటి కరించిన వారున్నారని, ఒక వైపు స్థిరాస్తి వ్యాపార విస్తరణ కొరకు మరో వైపు వస్తున్నారని ఉపాధ్యాయుల కష్టనష్టాలు తెలిసిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రవికుమార్ లు పాల్గొన్నారు.