విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

On
విడిసి చొరవతో... రాలిన

పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...?
గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు

ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

బుగ్గారం ఏప్రిల్ 18:

గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత ఆరేండ్ల సమస్యకు "పరిష్కారం" లభించింది.
గతంలో ఈ యొక్క పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా "న్యాయం" జరుగలేదని బాధితుని ఆరోపణ. 

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన పచ్చిమట్ల సత్తన్న గౌడ్ అనే వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో పంచాయతీ ఏర్పడ్డది. కాగా గత ఆరు సంవత్సరాల క్రితం కుల సంఘం మండల అధ్యక్షుడు అయిన అప్పటి అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు (తాజా మాజీ ప్రజా ప్రతినిధి భర్త) చట్టానికి విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఈ పంచాయతీని చేతబట్టాడు. ఇరువర్గాల వద్ద రూ.5000 (ఐదు వేల) చొప్పున దడువత్ తీసుకున్నాడు.
గత ఆరేండ్ల నుండి పంచాయతీ తెంపేది లేదు. బాధితుడికి న్యాయం చేసేది లేదు. తీసుకున్న దడువత్ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు. గతంలోనే ఈ పంచాయతీ కాస్త స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లింది. అయినా నేటికీ పరిష్కారంకు నోచుకోలేదు. పంచాయతీ తెగక పోవడంతో విసిగి వేసారిన బాధితుడు తన దడువత్ డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గత ఆరేండ్ల నుండి సదరు నాయకుని వద్దకు తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా.... ఎంత బ్రతిమి లాడినా.... కుల సంఘం జిల్లా పెద్దల వరకు వెళ్ళినా.... సదరు నాయకుడు ససేమిరా అంటూ... కుంటి సాకులతో... ఆ దడువత్ డబ్బులు నేటికీ తిరిగి ఇవ్వడం లేదు. చివరకు మరో రాజకీయ నాయకుడు ఇచ్చిన సలహా మేరకు సదరు బాధితుడు బుగ్గారంలోని "గ్రామ అభివృద్ది కమిటీ" ని సంప్రదించాడు.

బాధితుడు చెప్పిన వివరాలన్ని గ్రహించి సాక్ష్యా దారాలను తెలుసుకొని, పలువురు పంచాయతీ పెద్దలతో మాట్లాడి విడిసి బృందం వాటిని పరిశీలించారు. వెంటనే సంబంధిత కుల సంఘం జిల్లా అధ్యక్షులతో సమస్యను, జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని వివరించారు. వెంటనే మీ కుల సంఘం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో బాధితునికి అండగా ఉండి న్యాయ పోరాటం చేయాల్సి ఉంటదని విడిసి బృందం ఆ జిల్లా అధ్యక్షునితో తేల్చి చెప్పింది. విడిసి బృందం అందజేసిన న్యాయమైన సూచనలతో సదరు కుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంటనే స్పందించారు.

కేవలం గంట వ్యవధి లోనే బాధితునికి సదరు రాజకీయ నాయకుడు సుమారు ఆరేండ్ల క్రితం తీసుకున్న దడువత్ రూ.5,000 బాధితుని వద్దకు వచ్చి తిరిగి చెల్లించాడు. 

 విడిసి కృషి వల్ల పేదవాడినైన నాయొక్క దడువత్ డబ్బులు తిరిగి వచ్చాయని బాధితుడు పచ్చిమట్ల సత్తన్న గౌడ్ హర్షం వ్యక్తం చేసారు.


కాగా ఇలాగే అనేక చోట్ల అక్రమంగా రాజకీయ నాయకులు, పంచాయతీల పెద్ద మనుషులు దడువత్ లు తీసుకుంటూ వేలాదిగానే కాకుండా లక్షల్లో కూడా దోచుకుంటున్నారని విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన ఎండిసి కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆరోపించారు.


అక్రమ దడువత్ లే కాకుండా దావత్ ల పేరుతో లక్షలాది రూపాయలు బాధిత పేద ప్రజల నుండి పంచాయతీ పెద్దలు దోచుకుంటున్నారని ఆయన వివరించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చిన్న - చిన్న తగాదాలతో లక్షల్లో నష్ట పోతున్నారని తెలిపారు.  పంచాయతీ పెద్ద మనుషులు స్వార్థపూరితంగా, రాజకీయంగా, కుట్ర పూరితంగా పంచాయతీ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు.  చిన్న - చిన్న తగాదాలను కూడా పెద్దగా సృష్టించడం, ఏండ్ల తరబడి పంచాయతీలు పరిష్కారానికి నోచుకోకుండా చేయడంతో పేద ప్రజలు తీవ్రంగా మోస పోతున్నారని అన్నారు. సంబంధిత అధికారుల పేరుతో కూడా పంచాయతీ పెద్దలు, రాజకీయ నేతలు నేటికీ కూడా భారీ దోపిడీలకు పాల్పడుతున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని బుగ్గారం విడిసి విజ్ఞప్తి చేస్తోందన్నారు. లేకుంటే నిరుపేదలు ఈ పంచాయతీల పేరుతో జరిగే దోపిడీలను, మద్యం -  మాంసంతో కూడిన దావత్  (విందు) లను, పంచాయతీ దళారుల చేష్టలను తట్టుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చుక్క గంగారెడ్డి సూచించారు.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.  

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.   ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.  బ్రహ్మోత్సవాలలో భాగంగా పల్లకిలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిలతో స్వామివారు  గ్రామంలోని పెద్ద చెరువులో బోయవాళ్ళు ఏర్పాటు చేసిన తెప్పలో విహరించారు....
Read More...
Local News 

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామం లోని 300 పైగా ఆవులు ఏడ్లు గేదెలు దూడల కు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారుఈ కార్యక్రమం ఈ నెల 15 నుండి ఏప్రిల్ 15 వరకు గొల్లపల్లి మండలం లోని అన్ని గ్రామాలలో  కొనసాగుతాయని తెలిపారు...
Read More...
Local News 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్ 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం  రైతు వేదిక వద్ద కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ చట్టం భూ భారతి చట్టం గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులందరికీ  అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది  ఇట్టి కార్యక్రమానికి రైతులందరు హాజరై విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు రైతులకు తెలియ పరచాలని...
Read More...
Local News 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది  లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు):   నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలితా జ్యూవెలర్స్ నేడు సికింద్రాబాద్ లో తన 61వ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంను లలితా జ్యూవెలర్స్ అధినేత (గుండు బాస్) డా. ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హీత్ చేతుల
Read More...
Local News 

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు): NIPPON ఎక్స్ ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సిఎస్ఆర్)  కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బేగంపేట చౌరస్తాలో NIPPON  ఎక్స్ ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా...
Read More...
Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...
Opinion 

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ. మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్  కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ...
Read More...
State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...