వరంగల్ సభకు దండుకట్టండి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పాతికేళ్ల పార్టీ సభ దద్దరిల్లాలి
గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్*
ధర్మపురి ఎప్రిల్ 12:
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ధర్మపురి నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా దండుకట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
పార్టీ పాతికేళ్ల సభ కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు. ధర్మపురి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ధర్మపురి పట్టణంలోని SH గార్డెన్ లో జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గా పుట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం 25 సంవత్సరం లో విజయవంతంగా అడుగు పెడుతున్న సందర్భంగా అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎప్రిల్ 27 న నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 27 గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని,ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలవడం ఖాయమణి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమవుతోందni, హామీల అమలు దగ్గర నుంచి, పాలనా పరమైన నిర్ణయాల వరకు అభాసుపాలవుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని.. కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వివిధ మండలాల పార్టీ బాధ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
