గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడి అరెస్ట్,
మెట్టుపల్లి మార్చ్ 22( ప్రజా మంటలు దగ్గుల అశోక్).:
ఇబ్రహింపట్నం మండలం మేడిపల్లి గ్రామా శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉదయం 10:15 గంటలకు జాతీయ రహదారి (63) పై ఇబ్రహింపట్నం ఎస్సై. ఏ. అనిల్ తన సిబ్బంది తో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిజామబాద్ వైపు నుండి మెట్టుపల్లి వైపు ఒక మోటార్ సైకిల్ పై వస్తు, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని, వెంటనే పోలీసులు వెంబడించి, ఒకరిని పట్టుకొని విచారించగా ఆ యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
కోరుట్ల పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేసే షాపులో కూలీగా పనిచేస్తున్నపోగుల అజయ్ (23) గా గుర్తించారు.
అతని వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, ఒక హీరో HF-Delux బైక్ (TS02ED0209), ఒక ఐఫోన్ SE మొబైల్ ఫోన్ (6304763800) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 15,000/- గా పోలీసులు తెలిపారు. అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన మొహమ్మద్ అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలుచేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కోరుట్ల, మెట్టుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో అధిక ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు తెలిపాడు.
గతంలో కూడా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఒక గంజాయి కేసు మరియు ఇతర రెండు కేసులలో లో జైలుకు వెళ్ళినట్లు అతను ఒప్పుకున్నాడు.నిందితుడిపై ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు మరియు ఈ కేసులో పరారిలో ఉన్న మరొక నిందితున్ని త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తాము అని సి.ఐ. ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)