ఎస్ ఎస్ ఎస్ ఎం డి జి స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

On
ఎస్ ఎస్ ఎస్ ఎం డి జి స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పిల్లల వైద్యులు పూర్వ విద్యార్థి భీమేశ్వర్ విచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

జాతీయ పతాకాన్ని ఎస్కే ఎల్ ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎంవి నరసింహారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.

ఉపాధ్యాయ బృందం, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Tags