125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం నివాళులర్పించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేసీఆర్ గారిపై కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం మంచిదికాదు. ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి కేబినేట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్లి నివాళులు అర్పించాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమీర్ పేట్ వైశాకి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 13:
నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి కేబినెట్ మంత్రులతో సహా అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించి ఆ మహనీయునికి నివాళులర్పించాలని సూచించారు.
125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేయించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ గారిపై కోపంతో విశ్వమేధావి అయిన అంబేద్కర్ ను అవమానించడం మంచిది కాదన్నారు.
ప్రపంచ దేశాలు డాక్టర్ అంబేద్కర్ ను గౌరవిస్తున్నాయని, మన పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ పక్కనే నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోవడం సముచితం కాదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ కేంద్రంగా పాలన సాగిస్తూ కేసీఆర్ పై అక్కసుతో అంబేద్కర్ ను గౌరవించక పోవడం మంచిది కాదని సూచించారు.
గతేడాది అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని.ఏ ఒక్కరు కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదని గుర్తు చేశారు. కనీసం ఆ మహనీయుని విగ్రహానికి ఒక్క పూలమాల కూడా వేయలేదన్నారు. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ముఖ్యమంత్రి గారే చొరవ చూపాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అమీర్ పేట్ వైశాకి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
అమీర్ పేట్ లో ఆదివారం నిర్వహించిన వైశాకి వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో జీవించే రాష్ట్రమన్నారు. హైదరాబాద్ లో ఇంత వైభవంగా వైశాకి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో.హైదరాబాద్ లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామని, గురునానక్ జయంతి రోజున సెలవు ప్రకటించామని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబానికి పరామర్శ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ దంపతులు.పరామర్శించారు. షకీల్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం కవిత దంపతులు షకీల్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)