పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకం ఆవిష్కరించిన చీఫ్ విప్ అడ్లూరి.

ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంస పత్రాల వితరణ.

On
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకం ఆవిష్కరించిన చీఫ్ విప్ అడ్లూరి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యతిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులను, స్వాతంత్య్ర సమరయోధులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అయన తిలకించి వివరాలను తెలుసుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జగిత్యాల, కోరుట్ల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, సంజయ్ కల్వకుంట్ల, జిల్లా కలెక్టర్‌ బి. సత్య ప్రసాద్, జిల్లా జడ్జి నీలిమ, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Tags