గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

On
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) : 

 

గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) : 

గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.

చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు. 

గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.

దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.

ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.

గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం 

పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.

ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.

 ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

 ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.

గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు 

 పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.

అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.

భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.

వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.

కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.

భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.

గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

ప్రతి ఒక్కరు  హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి   -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.

ప్రతి ఒక్కరు  హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి    -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.    జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు    )జిల్లాలో  పోలీసులు ప్రమాదాల నివారణకు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం  రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై తోపాటు బ్యాంకు ఉద్యోగి హెల్మెట్ లేకపోవడం తో మృతి చెందారు.  ప్రతిరోజు హెల్మెట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందుతూ ఉండడంతో బుధవారం మధ్యాహ్నం 12...
Read More...
Local News 

నల్లగొండ    జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి

నల్లగొండ    జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. నల్లగొండ ఫిబ్రవరి 5(ప్రజా మంటలు      )ఈ నెల 8 నుండి 12 వ తేదీ వరకు వరకు  నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం రోజున కోడిమ్యాల మండలంలోని...
Read More...
Local News 

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ సికింద్రాబాద్, ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు ):  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్తగా బచ్చన్నపేటకు చెందిన సుత్రామే రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భవసార క్షత్రియ సమాజ్ సభ్యులు రామకృష్ణను ఘనంగా సన్మానించారు...
Read More...
Local News 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.                                                                                                                జగిత్యాల ఫిబ్రవరి 5( ప్రజా మంటలు       )                                               బుధవారం రోజున జిల్లాలో గల ఈవీఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు  సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం రోజు ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని కలెక్టర్...
Read More...
National  Filmi News  State News 

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!   OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు! హైదరాబాద్ ఫిబ్రవరి 05: శంకర్ దర్శకత్వం వహించి, నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్ఫామ్లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది . ఇది 7వ తేదీన విడుదలవుతోంది....
Read More...
Local News 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి... గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా - లత కూతురు స్పందన ఇటీవల ఫిబ్రవరి 1 శనివారం ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ...
Read More...
Local News 

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) : పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ క్రియాశీల సభ్యులు గొల్లపల్లి మండలం లోని లొత్తునుర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పరి గంగయ్య (స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం) గత నెల 31 శుక్రవారం అనారోగ్యంతో మరణించగా, పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ...
Read More...
Local News  State News 

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.    

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.     కన్న తల్లిని గెంటేసిన కొడుకు.            -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.        జగిత్యాల ఫిబ్రవరి 05: కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస   గ్రామానికి చెందిన    గుగ్గిళ్ల నర్సవ్వ( 80)  అనే వృద్ధ తల్లిని  ఆమె కట్టుకున్న స్వంత   ఇంటి లో నుంచి నడిపి  కొడుకు మల్లయ్య  గెంటి...
Read More...
Local News 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు  పాలాభిషేకం 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు   పాలాభిషేకం  గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ
Read More...
Local News 

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఫిబ్రవరి 05: కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా  ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
Local News 

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... సికింద్రాబాద్​, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు): ముదిరాజ్​ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ  నుంచి బీసీ ఏ  లోకి ముదిరాజ్​ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్​ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్​ కు ఈమేరకు...
Read More...
Local News 

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి   కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి కరీంనగర్ ఫిబ్రవరి 05: కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...