అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 23:
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం అభ్యంతరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ కొరకు గురువారం ధర్మపురి పట్టణంలోని 13,15 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అధికారి వచ్చి రేషన్ కార్డులను ఇస్తామని, ఇళ్లను ఇస్తామని సమావేశాలు
పెట్టి ఒక్క దరఖాస్తు తీసుకోలేదని, సిఎం రేవంత్ రెడ్డి మార్పు కోరుకుని, అర్హులైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివ్వాలనే నిర్ణయం మేరకు,
గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతున్న
దని, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైనా గ్రామానికి వచ్చినప్పుడు... రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదవారికి ఇవ్వాలని ఆదేశించారని వివరించారు.
ప్రస్తుతం గ్రామ సభల్లో ప్రకటించింది ఫైనల్ లిస్ట్ కాదనీ, లిస్టులో పేరు రాని వారు, అధైర్య పడాల్సిన అవసరం లేదని, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో కూడా దీని కొరకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందనీ, అక్కడ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఎన్నికల కోసం చేపట్టే గ్రామ సభలు కాదని, కేవలం ప్రజల కోసం ఏర్పాటు చేసిన సభలు మాత్రమే అని, నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో, రేషన్ కార్డుల జారీ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కు చెప్పడం జరిగిందన్నారు.
గత పాలకుల నిర్వాకం వలన తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంత ప్రజానికానికి నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపలేదని, రోడ్లు, డ్రైనేజీలు విషయంలో కూడా ఇటీవలె TUFIDC గ్రాంట్ కింద నిధులను కేటాయించడం జరిగిందనీ వాటికి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగిందని తెలిపారు. గోదావరిలో మురుగు నీరు కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ధర్మపురి లో ఒక రెవెన్యూ డివిజన్, బస్ డిపో, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రజల అభివృదికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, వైఎస్ చైర్మన్ రామయ్య, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్ లు, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.