డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

On
డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


కోరుట్ల ఆగస్టు 30 :
ప్రస్తుత వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. 

ప్రస్తుత వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా వంటి వ్యాధులతోపాటు విష జ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. 
ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రజలు కాచి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. 
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పల్లెలు, పట్టణాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయాలన్నారు. 
పరిసరాలను పరిశుభ్రత పాటిస్తే వ్యాధులను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. 
వర్షపు నీరు నిల్వ ఉన్నచోట ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయన సూచించారు.
మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు పట్టణం, గ్రామాల్లోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, ఖాళీ స్థలంలో చెత్త చెదారం శుభ్రపరిచి ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నివారించాలని, బ్లీచింగ్ ఫంగింగ్ చేపట్టాలని, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 
అదేవిధంగా విష జ్వరాలు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అవసరమైన వారికి మందులను పంపిణీ చేయాలని నర్సింగరావు కోరారు.

Tags