జర్నలిస్టుల వంటావార్పుతోనిరసన : మా ఆకాంక్ష నెరవేరకుంటే జిల్లా స్థాయికి ఉద్యమాన్ని విస్తరిస్తాం -జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు.     

On
జర్నలిస్టుల వంటావార్పుతోనిరసన : మా ఆకాంక్ష నెరవేరకుంటే జిల్లా స్థాయికి ఉద్యమాన్ని విస్తరిస్తాం -జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు.     

జర్నలిస్టుల వంటావార్పుతోనిరసన :
మా ఆకాంక్ష నెరవేరకుంటే జిల్లా స్థాయికి ఉద్యమాన్ని విస్తరిస్తాం -జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు.                  జగిత్యాల ఆగస్ట్ 14( ప్రజా మంటలు) :

  • జర్నలిస్టుల ఇళ్లస్థలాల సాధన కోసం గత 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా బుధవారం దీక్షా స్థలంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి, నాయకులకు చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారమయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తమ కలం, గళం ద్వారా ఎంతోమంది నాయకులను తయారు చేశామని అలాంటి నాయకులే జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి విస్తరిస్థామని హెచ్చరించారు. జర్నలిస్టుల దీక్షలకు సారంగాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,రాజశేఖర్ జగదీష్, శ్రీనివాస్, తదితరులు సంఘీభావం తెలుపగా వంట వార్పు కార్యక్రమానికి  గో సేన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు కట్ట శివకుమార్ సహకరించారు.
Tags