ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

On
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్


జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు)

రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి సందర్శన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం రోజున స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, ఐ.సి.యు. , ఆపరేషన్ థియేటర్, మేల్, ఫిమేల్ వార్డులు, సిటీ స్కాన్, స్కానింగ్ రూమ్, ఎక్స్-రే, క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని, వయో వృద్ధుల ఫిజియో థెరపీ సేవ కేంద్రంలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తోలగించాలని సూచించారు. ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా చెత్త చెదారాన్ని, పనికిరాని స్క్రాప్ ను తొలగించాలని శానిటేషన్ ఇంచార్జీని ఆదేశించారు. 

కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు, ఆర్.ఎం.ఓ. రాజేంద్ర ప్రసాద్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Tags