సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి - దావ వసంత సురేష్ - జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్

On
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి - దావ వసంత సురేష్ - జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 25 ఆగస్టు (ప్రజా మంటలు)  

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన దావ వసంత సురేష్ - జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, అమూల్యమైన ఈ జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం మనకు అందిస్తుందని దావ వసంత సురేష్ అన్నారు.

శ్రీకృష్ణాష్టమి (ఆగస్టు 26) ని పురస్కరించుకుని దావ వసంత సురేష్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుని మహోన్నత వ్యక్తిత్వం, జీవన విధానం నేటి కలియుగంలోనూ మనకు గొప్ప ప్రేరణనిస్తాయని వారు తెలిపారు.

శ్రీకృష్ణుడు ప్రవచించిన గీత కేవలం ఆధ్యాత్మిక బోధనలకు మాత్రమే పరిమితం కాదనీ, అదొక విజ్ఞాన భాండాగారమని, జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగడానికి కావాల్సిన ప్రేరణను గీత అందిస్తుందని వారు తెలిపారు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే శ్రీకృష్ణుని సందేశమే నేటి పాలక వ్యవస్థలకు మార్గనిర్దేశనం చేస్తుందని అన్నారు.

శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉట్ల పండుగ జీవితాన్ని ఆటపాటలతో ఆనందమయం చేసుకోవాలని తెలియచెప్తుందని వారు తెలిపారు.

సమస్యల వలయంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణుని తాత్వికత సరైన దారిని చూపుతుందని వారు ఉటంకించారు.

Tags