జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నర్సింగరావు.

On
జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నర్సింగరావు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఆగస్టు 15 ( ప్రజా మంటలు) : 

గత 13 రోజులుగా జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల కోసం దీక్ష నిర్వహిస్తున్న జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని జువ్వాడి నరసింగరావు గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ.....

కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సుముఖంగా ఉందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరుల సహకారంతో మీ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన వంతుగా ఇళ్ల స్థలాల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంఘీభావం తెలిపిన జువ్వాడి నరసింగరావుకు అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

Tags