రుణమాఫీ లోసుగులపై చర్చను దారి మల్లించేందుకే BRS విలీనం చర్చ - కేంద్ర మంత్రి బండ్ సంజయ్

On
రుణమాఫీ లోసుగులపై చర్చను దారి మల్లించేందుకే BRS విలీనం చర్చ - కేంద్ర మంత్రి  బండ్ సంజయ్

రుణమాఫీ లోసుగులపై చర్చను దారి మల్లించేందుకే BRS విలీనం చర్చ 

హైదరాబాద్ కోఠిలో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్

హైదారాబాద్ ఆగస్టు 28:

విలీనం, పొత్తులు గంగలో కలవనీయండివాటితో ప్రజలకేం సంబంధం?కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉంది.అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదను అన్నారు 

రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా,రుణమాఫీసహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు 

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలనీ,రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందనీ,64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. 

రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిబడ్జెట్లో రూ.26 వేలు కేటాయించిచివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారనీ అన్నారు.

Tags