తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

On
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.

తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.

ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.

-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు  

తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.

ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.

 ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.

ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.

 మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.

పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.  

ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.  

నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.

కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.

ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.

Tags

More News...

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక అమెరికాలోని 295 మంది భారతీయులతో, శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక • అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు వాషింగ్టన్ ఫిబ్రవరి 05: అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
National  State News 

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! 19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా! చెన్నై ఫిబ్రవరి 05: శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
National  State News  International  

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05: మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు. బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
Local News 

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
National  Local News  State News 

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
Local News 

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
National  Local News  State News 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
National  State News 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04: కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
Local News 

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన      *  దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ సికింద్రాబాద్​, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) : సికింద్రాబాద్ ఎస్​డీ రోడ్డు లోని అవినాష్​ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్​ఎస్​వీ నాయకులు ఆందోళన నిర్వహించారు.  కాలేజీ గేట్​ వద్ద బైఠాయించి, డిగ్రీ  విద్యార్థి రాహుల్​ కు న్యాయం చేయాలని...
Read More...

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం హన్మకొండ ఫిబ్రవరి 04: చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
Local News 

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి : కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...