శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు.

- లోక కళ్యాణార్థం సర్వారిష్ఠ శాంతి.

On
శ్రీ నిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

కరీంనగర్ ఏప్రిల్ 15 (ప్రజా మంటలు)

స్థానిక తిరుమల నగర్ లోని మయూరగిరిపీఠం శ్రీనిలయంలో వసంత నవరాత్రులలో భాగంగా రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమును పురస్కరించుకొని మయూరగిరి పీఠాధిపతులు శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో* *అన్ని నక్షత్రల వారు, అన్ని రాశుల వారు, సుఖ సంతోషాలతో ఉండాలని, నక్షత్రేష్టి పూర్వక సర్వారిష్ట శాంతిని మరియు లోక కళ్యాణార్థం జపహోమ తర్పణాలను నిర్వహించారు..

ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, కావడం వలన సమాజంలో ఎలాంటి చెడు జరగకూడదని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మా వంతు కర్తవ్యం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కొంత వరకైన శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు..

పలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణ మాచార్యులు. వేణుగోపాలాచార్యులు.. వినయ్ స్వామి, వివేక్ స్వామి,గోపి శర్మ, శివరామకృష్ణ శర్మ మొదలగు పండితులు పాల్గొన్నారు...

Tags