ఉగాది జాతీయ పురస్కారాలు వర్షకొండ గ్రామీణ వైద్యుడు నగేష్ చారి కి ‘నంది అవార్డు’
ఉగాది జాతీయ పురస్కారాలు
వర్షకొండ గ్రామీణ వైద్యుడు నగేష్ చారి కి ‘నంది అవార్డు’
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 15 (ప్రజామంటలు): ఉగాది జాతీయ పురస్కారాలు 2024. సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలలో కృషి చేసిన ‘‘విశ్వ కర్మ సేవ ట్రస్ట్’’. చెరుకూరి సేవ ట్రస్ట్( గుంటూరు వారి ఆధ్వర్యంలో) పురస్కారాలు కమిటీ సభ్యులు శ్రీనివాసులు మరియు బాల బ్రాహ్మ చారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, ఒరిశా రాష్ట్రాలకు చెందిన వివిధ రంగంలో అన్ని కులాల కళాకారులు దరఖాస్తు చేసుకోగా తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు మద్దనపల్లి నగేష్ చారి కి జాతీయ గ్రామీణ వైద్య సేవ రత్న మరియు విశ్వకర్మ లెజెండరీ అవార్డు మరియు నంది అవార్డు గుంటూరు పున్నూరు ఎమ్మెల్యే కిరారి రోశయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.