జమ్మికుంటాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ

On
జమ్మికుంటాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ

నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ

జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని అమలు కాని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు

సామాజిక కార్యకర్త, షేక్‌ సాబిర్‌ అలి విమర్శ

 

జమ్మికుంట (ప్రజామంటలు): జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని తెలంగాణ ఎక్సైజ్‌ మరియు ప్రొహిబిషన్‌ ఆక్ట్‌ ను అనుసరించి ఏ4 క్యాటగిరికి సంబంధించిన 8 మద్యం ఉన్నాయి.

నిబంధనల మేరకు వీటిని ఉదయం 10 గం. నుండి సాయంత్రం 10 గం. వరకు మాత్రమే నిర్వహించాలి. ఇదేవిధంగా ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ మరియు బియర్స్‌ ఎం.ఆర్‌.పి. ధరలకే విక్రయించాలి. మరియు రోజువారి లావాదేవీల మరియు సరుకు వివరాల అప్డేట్స్‌ ను ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ శాఖ కు అందించాలి. ఇదేవిధంగా వైన్స్‌ లలో అక్రమాలు జరగకుండా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూం కి లింక్‌ చేయాలి. ఇదేవిధంగా వైన్స్‌ లలో వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ (సిట్టింగ్‌) నిర్వహించాలి అంటే 5లక్షల అదనపు రుసుము చెల్లించాలి. కానీ ఈ ఎన్నికల సమయంలో జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని మద్యం వ్యాపారులు మాత్రం అధికారుల తనిఖీలకు తావు లేకుండా  విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్న కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం మూలంగా జీరో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనే విషయం పై అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇదేవిధంగా పట్టణంలోని వివిధ హోటల్స్‌ అండ్‌ లాడ్జ్‌ లు మద్యం సిట్టింగ్‌ లకు కేరాఫ్‌ అడ్రస్‌ మారాయి. కావున ఇకనైనా అధికారులు స్పందించి రోజు వారి తనిఖీలను ముమ్మరం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Tags